కాంగ్రెసుపై నిప్పులు చెరిగిన వైయస్ జగన్, కొనసాగుతున్న ఓదార్పు

YS Jagan
విశాఖపట్నం: కాంగ్రెసు ప్రభుత్వాలపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ నిప్పులు చెరిగారు. రైతు గోడు వినాలని ఢిల్లీ వెళ్లి దీక్ష చేసినా వినేందుకు, కనీసం చూసేందుకు కూడా ప్రధాన మంత్రికి ఐదు నిమిషాలు తీరిక లేదని ఆయన అన్నారు. మన రాష్ట్రం ఎడారవుతుంటే పట్టని కాంగ్రెస్ పార్టీకి మనం ఎంపీలను ఎందుకు ఇవ్వాలంటూ నిప్పులు చెరిగారు. విశాఖ జిల్లా ఓదార్పులో భాగంగా గురువారం సాయంత్రం అనకాపల్లిలో, రాత్రి పరవాడలో వైఎస్సార్ విగ్రహావిష్కరణల అనంతరం ఆయన ప్రసంగించారు. రైతన్నపై దెబ్బమీద దెబ్బ పడుతోందని ఢిల్లీకి వెళ్లి అపాయింట్‌మెంట్ అడిగితే కనీసం ఐదు నిమిషాల సమయం కూడా దొరకని పరిస్థితిలో ఉంది ఈ రాష్ట్రం. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు అన్యాయంగా ఉందని, రాష్ట్రం ఎడారిలా మారుతోందని, భారీగా నష్టం వాటిల్లనుందని.. ఇది వివరించేందుకు ఒక్క ఐదు నిమిషాలు అపాయింట్‌మెంట్ కోరితే ప్రధానమంత్రికి తీరిక లేదు. 33 మంది ఎంపీలను వైఎస్ ఢిల్లీకి పంపితే ఇదా మన దుస్థితి?" అంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

రాష్ట్రానికి ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి ఇంత మంది ఎంపీలను మనం ఎందుకివ్వాలని జగన్ ప్రశ్నించారు. 'ఒక్క రైలు కావాలన్నా, రైలు రూటు కావాలన్నా మమతా బెనర్జీ దగ్గరికి పోవాలి. ఆవిడేమో పశ్చిమ బెంగాల్‌కో, కోల్‌కతాకో ఇస్తారు. అంతకుముందు రైల్వే మంత్రిగా లాలూప్రసాద్ ఉంటే.. ఆయనేమో బీహార్‌కు పంపుకొంటారు. చివరికి వ్యవసాయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పుకొందామంటే.. ఆ శాఖ మంత్రేమో మహారాష్టక్రు చెందినవారు. మరి మన రాష్ట్రం నుంచి ఎంపీలను ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీకి ఎందుకివ్వాలి?" అని ప్రశ్నించారు. వరుసగా వరదలు వస్తే రైతులను ఆదుకోవడానికి అవసరమైన ఆ మంత్రి పదవులు మన రాష్ట్రానికి ఎందుకు రావు? అని జగన్ ప్రశ్నించారు. 'ఆ పదవులను మన పార్టీ ద్వారా మనమే తెచ్చుకుందాం. మన ఆత్మగౌరవాన్ని మనం నిలుపుకొందాం. మన ఎంపీలను మనమే పంపుకొందాం. ఎవరు ప్రధాన మంత్రిగా ఉన్నా మన మంత్రి పదవులను మనమే తెచ్చుకుందాం. మా అభివృద్ధి మాకు కావాలి అని అడుగుదాం.." అని పిలుపునిచ్చారు.

పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై జగన్ నిప్పులు చెరిగారు. 'ఈ కాంగ్రెస్ పార్టీ పోలవరం కావాలని కొందరు ఎంపీలతో చెప్పిస్తుంది. మరికొందరితో వద్దని చెప్పిస్తుంది. పోలవరం ఇవ్వొచ్చు కదా అని అడుగుతున్నా.. ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు ఎందుకు నిర్మించడం లేదని అడుగుతున్నా. పేదల బాగోగులు చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. పెట్రోలు ధరలు ఆరు నెలల్లో ఏడుసార్లు పెంచారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. అసలు పేదవాడి గురించి కాంగ్రెస్‌కు ఏమైనా ఆలోచన ఉందా?" అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+