గవర్నర్ భరద్వాజ్ పై బిజెపి ఆగ్రహం, రాష్ట్ర బంద్: పలు చోట్ల హింస

రాష్ట్రవ్యాప్తంగా తాము బస్సులను రద్దు చేశామని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. శుక్రవారం రాత్రి బస్సులపై రాళ్లు రువ్విన సంఘటనలు జరిగినప్పటికీ బెంగళూర్లో బస్సులు నడుపుతున్నామని బెంగళూర్ మెట్రోపాలిటన్ రవాణా సంస్థ తెలిపింది. అయితే, బస్సు సౌకర్యాలు సరిగా లేక బెంగళూర్ పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కార్యాలయాలకు చేరుకోవడానికి వారు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూర్లో 18 వేల మంది పోలీసులను నియోగించారు. యడ్యూరప్ప సొంత జిల్లా షిమోగాలో ఆందోళనకారులు అర గంటపాటు రైళ్లను ఆపేశారు.
కాగా, యడ్యూరప్ప రాజీనామా చేసే ప్రసక్తే లేదని బిజెపి తేల్చి చెప్పింది. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని బిజెపి ప్రకటించింది. యడ్యూరప్ప ప్రాసిక్యూషన్కు అనుమతించడం రాజ్యాంగవిరుద్ధమని, రాజకీయ దురుద్దేశంతో కూడిందని విమర్శించింది. ఇదిలా వుంటే, గవర్నర్ నిర్ణయాన్ని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సమర్థించారు. ముఖ్యమంత్రి ప్రాసిక్యూషన్కు ఓ గవర్నర్ అనుమతించడం ఇదే మొదటిసారి కాదని, ఇంతకు ముందు ఆలాంటివి జరిగాయని ఆయన అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications