చంద్రబాబు దొంగల్లుడు, చిన్నపిల్లాడితో పోటీ పడుతున్నాడు: లక్ష్మీపార్వతి

రిలయన్స్తో చేసుకున్న ఒప్పందాన్ని బయటపెడితే ప్రజలు చంద్రబాబుకు ఓటేయరని, ప్రజలకు నష్టం జరిగే విధంగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్నారని ఆమె అన్నారు. తమ అల్లుడు చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారని, తానే అన్నీ బాగు చేశానని చెప్పుకుంటున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు అదికారంలో ఉన్నప్పుడు తొమ్మిదేళ్లల 51సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, నాలుగు సార్లు కరెంట్ సార్లు పెరిగాయని, మూడు సార్లు ఆర్టీసి బస్సు చార్జీలు పెరిగాయని ఆమె వివరించారు. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజలకు మంచి జరుగుతూ వచ్చిందని ఆమె చెప్పారు.
తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీ రామారావుకు ఎంతటి స్పందన లభించిందో అంతటి ప్రజాస్పందన ఇప్పుడు వైయస్ జగన్కు లభిస్తోందని ఆమె అన్నారు. వైయస్ జగన్ ఒక్కరే ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారని ఆమె అన్నారు. చంద్రబాబుకు మలేరియా పట్టుకుందని సినీ నటుడు ధర్మవరం సుబ్రహ్మణ్యం అన్నారు. వైయస్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తే సమాధానాలు చెప్పడం లేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్సించారు. అంతకు ముందు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడారు.












Click it and Unblock the Notifications