కిరణ్ కుమార్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు: మేకపాటి

Mekapati Rajamohan Reddy
విశాఖపట్నం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చునని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి హెచ్చరించారు. కిరణ్ కుమార్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఆయన అన్నారు. విశాఖపట్నంలోని వైయస్ జగన్ దీక్షలో ఆయన శనివారం ప్రసంగించారు. తమ వద్ద 20 మంది శాసనసభ్యులున్నారని, అందువల్ల కిరణ్ ప్రభుత్వం మైనారిటీలో పడినట్లేనని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గుట్టుగా ప్రభుత్వాన్ని నడుపుకోకుండా నైతికి విలువల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రేపో మాపో పడిపోయే స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.

తెలుగుజాతిని విడదీయడానికి కాంగ్రెసు కుట్ర చేస్తోందని, 2009 డిసెంబర్ 9వ తేదీ ప్రకటన అందులో భాగమేనని ఆయన అంటూ తెలుగువారిని ఎన్నిసార్లు విడదీస్తారని ప్రశ్నించారు. నానా రకాలుగా హింసించి, మనోవేదనకు గురి చేసి వైయస్ జగన్‌ను పార్టీ నుంచి బయటకు పంపారని ఆయన విమర్శించారు. అందరం రాజీనామా చేద్దామని, రాజీనామాలు చేసిన తర్వాత తాము వైయస్ ఫొటో పెట్టుకుని పోటీ చేస్తామని, కిరణ్ కుమార్ రెడ్డి సోనియా ఫొటో పెట్టుకుని పోటీ చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి దయవల్లనే కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. వైయస్సార్ 33 మంది పార్లమెంటు సభ్యులను ఇచ్చారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+