తెలంగాణపై సోనియా ఉక్కిరి బిక్కిరి: పార్టీలోనే రెండు అభిప్రాయాలు

తాము తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ముందుకు సాగే పరిస్థితి లేదు. ఈ సమస్యను 2013 వరకు సాగదీయాలనే పార్టీ అధిష్టానం ప్రయత్నం కూడా ఫలించే సూచనలు కనిపించడం లేదు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు యథాతథ స్థితికి అంగీకరించినా తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఆగే పరిస్థితి లేదు. దానికి తోడు, విపక్షాల నుంచి తెలంగాణపై నిర్ణయానికి ఒత్తిడి తెస్తున్నాయి. సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు నివేదికలోని ఆరో ప్రత్యామ్నాయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. దీంతో సోనియా కక్క లేక మింగలేక అవస్థలు పడుతున్నారు.
తమ పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడం తొలుత భావించినట్లు ఈ నెల 26లోపు శ్రీకృష్ణ కమిటీపై కేంద్ర హోం మంత్రి చిదంబరం అఖిలపక్ష సమావేశం నిర్వహించే అవకాశాలు లేవు. తెలంగాణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్లో అనిశ్చితి కొనసాగుతున్నందున ఇప్పటికిప్పుడు అఖిలపక్షం వల్ల ప్రయోజనం ఉండదని పార్టీ కోర్కమిటీ భావించింది. ప్రధాని మన్మోహన్సింగ్ నివాసంలో శుక్రవారం రెండుగంటల పాటు సమావేశమైన కోర్కమిటీ ఏ నిర్ణయానికీ రాలేకపోయింది. రెండు ప్రాంతాల ఎంపీలతో చర్చలు కొనసాగుతున్నందున కొంతకాలం వేచి చూడడం మంచిదని కమిటీ అనుకున్నట్లు తెలిసింది. జనవరి 6న నిర్వహించిన అఖిలపక్షం భేటీని మూడు పార్టీలు బహిష్కరించాయని, రాష్ట్ర పార్టీలోనూ అనిశ్చితి ఉందని, పరిస్థితిలో ఎటువంటి మార్పూలేనందున ఇప్పటికిప్పుడు అఖిలపక్షం నిర్వహించడంలో అర్థం లేదని కోర్ కమిటీ భావించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications