తెలంగాణకు అందరమూ కట్టుబడి ఉన్నాం: మంత్రి జె గీతారెడ్డి

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలం కూడా కట్టుబడి ఉన్నామని మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యానించారు. మేం కూడా తెలంగాణవాదులమని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నామని చెప్పారు. మరో మంత్రి బసవరాజు సారయ్య మాట్లాడాతూ తమకు పదవులకంటే తెలంగాణ ముఖ్యమని చెప్పారు. తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతా ఐక్యంగానే ఉందన్నారు. కిరణ్కుమార్ రెడ్డి తెలంగాణపై పార్టీది ఒక వైఖరి, ప్రభుత్వానిది ఒక వైఖరి అనడాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి తప్పుబట్టారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు వేరువేరుగా స్పందించారు.












Click it and Unblock the Notifications