శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ దీక్షల్లో ముఖ్యమంత్రి పదవి కోసం అర్భాటమే: ఎర్రన్నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
శ్రీకాకుళం: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యదీక్ష, జలదీక్ష, జనదీక్ష పేరుతో చేసిన మూడు దీక్షలలోనూ అధికార ఆర్భాటమే తప్ప ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి కనిపించలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు సోమవారం ఆరోపించారు. జగన్‌కు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని విమర్శించే నైతికతగానీ, అర్హతగానీ, రాజకీయ పరిజ్ఞానంగానీ లేదన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర ఆరాటం చేస్తున్నారన్నారు.

జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటం ఆస్తులు కాపాడుకోవడానికే, మరిన్ని ఆస్తులు రక్షించుకోవడానికా అని ప్రశ్నించారు. జగన్ పోరాటంలో చిత్తశుద్ధి లేదన్నారు. జగన్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు దీక్షలు చేసి ఉంటే ప్రజలు నమ్మేవారని అన్నారు. కానీ ఆయన ఇప్పుడు చేస్తున్న దీక్షలు అధికారం కోసమేనని ప్రజలందరికీ అర్థమవుతున్నాయన్నారు. పెట్రోల ధరలపై పెరుగుదలకు వ్యతిరేకంగా దీక్ష చేసిన జగన్‌కు పెట్రోలు ధరలు ఎలా పెరుగుతాయో తెలుసునా అని ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X