హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డిలపై మంత్రి దానం నాగేందర్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావులపై మంత్రి దానం నాగేందర్ మంగళవారం తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి దానం హైదరాబాదులోని ఎంఎస్ మక్తాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కెసిఆర్ ప్రోద్బలంతో టిఆర్ఆస్ కార్యకర్తలు భౌతికదాడులకు దిగుతున్నారని ఆరోపించారు. మంత్రి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే రాజయ్యలపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడానికి కారణం వారు బలహీన వర్గాలకు చెందిన వారేనని అన్నారు.

బడుగులపై భౌతిక దాడులకు దిగుతున్న టిఆర్ఎస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రజలు న్యాయం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులపై తాను స్పందించనని స్పష్టం చేశారు. జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించిన విషయాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించిందని దానిని కోర్టు చూసుకుంటుందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X