బ్లాక్ మనీ నియంత్రణకు ఐదంచెల వ్యూహాన్ని అనుసరిస్తాం: ప్రణబ్
పన్ను ఎగవేతదారుల సమాచారం సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. నల్లధనం నియంత్రణకు గత 18 నెలల్లో తీసుకున్న చర్యలు ప్రోత్సాహకర ఫలితాలు వచ్చాయని ఆయన చెప్పారు. గత 18 నెలల్లో లెక్కలు చెప్పని 15 వేల కోట్ల నల్లధనం గుర్తించినట్లు ఆయన తెలిపారు. నల్లధనం నియంత్రణకు ఏర్పాటైన అంతర్జాతీయ టాస్క్ఫోర్స్లో భారత్ భాగస్వామిగా ఉందని ఆయన చెప్పారు. ధరలు తక్కువ చూపి పన్నులు ఎగవేసే పద్ధతి హానికరమని ఆయన అన్నారు. దేశంలోని నల్లధనం అంచనాకు ఓ ప్యానెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భాగస్వామిగా ఉందని ఆయన చెప్పారు. నల్లధనం వివరాలను ప్రత్యక్షంగా వెల్లడించలేమని, అలా చేస్తే విదేశాలు నల్లధనానికి సంబంధించిన వివరాలు ఇవ్వవని, అయితే నేరస్తులను గుర్తించిన తర్వాత చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు.
పన్నుల ఎగవేత ద్వారానే 77.6 శాతం నల్లధనం దేశ సరిహద్దులు దాటుతోందని ఆయన చెప్పారు. నల్లధనం ఎవరిదన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని ఆయన చెప్పారు. ప్రైవేట్ ఒప్పందం ద్వారా స్విస్ యుబిఎస్ బ్యాంక్ నుంచి అమెరికాకు సమాచారం అందుతోందని ఆయన అన్నారు. అమెరికా నేరుగా స్విస్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోలేదని ఆయన చెప్పారు. విదేశాల్లో నల్లధనం ఉన్న భారతీయులెవరు అనేది తనకు తెలియదని, అలా తెలిసే అవకాశం కూడా లేదని ఆయన చెప్పారు. యుబిఎస్ బ్యాంక్ ప్రతినిధుల అరెస్టు తర్వాతనే నల్లధనం విషయం వెలుగులోకి వచ్చిందని ఆయన చెప్పారు.