వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్కో విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి, 35 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Russia
మాస్కో: రద్దీ ఎక్కువగా ఉండే మాస్కోలోని డొమోడెడోవో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడితో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 35 మంది చనిపోయారు. మరో 130 మంది గాయపడ్డారు. భారత కాలమానం ప్రకారం - సోమవారం రాత్రి 7.02గంటలకు విమానాశ్రయంలోని అంతర్జాతీయ ఆగమనాల (ఇంటర్నేషనల్‌ అరైవల్స్‌) విభాగంలోని బ్యాగేజీ హాల్లో ఇది చోటుచేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకోవడాన్ని చూశామని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. విస్ఫోటం కారణంగా విమానాశ్రయ భవనంలో దట్టంగా పొగ అలముకొంది. ఈ ఘటనలో చిక్కుకున్న ఉద్యోగులు ప్రధాన విమానాశ్రయం, ఆగమనాల విభాగానికి మధ్య ఉన్న ఒక గోడను పగులగొట్టి బయటపడ్డారు.

ఇది ఉగ్రవాద దాడి అని రష్యా అధ్యక్షుడు అన్నారు. మాస్కోలోని మరో రెండు వాణిజ్య విమానాశ్రయాల్లో భద్రత పెంచాలని అధ్యక్షుడు డిమిట్రీ మెద్వెదేవ్ ఆదేశాలు జారీ చేశారు. మాస్కో సబ్ వే, రష్యా రైళ్లల్లో దాడులు తరుచుగా జరుగుతున్నప్పటికీ విమానాశ్రయంపై దాడి జరగడం ఇదే మొదటిసారి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X