తెలంగాణలో రెండో రోజూ రచ్చరచ్చే: జానారెడ్డిని రావద్దన్న తెలంగాణవాదులు
మెదక్ జిల్లా కమిలి మండలం చీమలపాడులో కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దానిని కొందరు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నల్గొండ జిల్లా వలిగొండలో రచ్చబండ కార్యక్రమంలో మంత్రి జానారెడ్డి పాల్గొనవలసి ఉంది. అయితే పలువురు తెలంగాణవాదులు జానారెడ్డిని రచ్చబండ కార్యక్రమం కోసం రావద్దని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ముందస్తుగా కొందరు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. వారు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Story first published: Tuesday, January 25, 2011, 12:34 [IST]