హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో రెండో రోజూ రచ్చరచ్చే: జానారెడ్డిని రావద్దన్న తెలంగాణవాదులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణవాదులు రెండోరోజు కూడా అడ్డుకుంటున్నారు. తెలంగాణలోని పది జిల్లాలలో తెలంగాణవాదులు ప్రజాప్రతినిధులను, అధికారులను అడ్డుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని మామిళ్లవీరయ్యపల్లి గ్రామంలో రచ్చబండకు వచ్చిన అధికారులను తెలంగాణవాదులు కిడ్నాప్ చేశారు. పోలీసులు వారిని అనుసరించడంతో వారు నర్సంపేటలో వదిలి వెళ్లారు. అయితే కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మెదక్ జిల్లా కమిలి మండలం చీమలపాడులో కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దానిని కొందరు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నల్గొండ జిల్లా వలిగొండలో రచ్చబండ కార్యక్రమంలో మంత్రి జానారెడ్డి పాల్గొనవలసి ఉంది. అయితే పలువురు తెలంగాణవాదులు జానారెడ్డిని రచ్చబండ కార్యక్రమం కోసం రావద్దని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ముందస్తుగా కొందరు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. వారు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X