సాక్షి ఓ చెత్త పేపరు, ఎక్కువ తూగుతుందనే కొంటున్నారు: బైరెడ్డి
వైఎస్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆస్తిని అక్రమంగా దోచుకున్నదన్నారు. వైఎస్ అక్రమార్జనతో రాష్ట్రాన్ని లూటీ చేశారన్నారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని పలువురు పెద్దలకు వివిధ రూపాల్లో లాభాలు చేకూర్చి వారితో సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టించారన్నారు. సాక్షిలో టిడిపిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వరద ముంపు పరిహారం తాను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయని, తాను ఆ పరిహారం తీసుకున్నట్టు నిరూపిస్తే సాక్షి కార్యాలయం ముందు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేశారు.
Comments
Story first published: Wednesday, January 26, 2011, 16:17 [IST]