కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షి ఓ చెత్త పేపరు, ఎక్కువ తూగుతుందనే కొంటున్నారు: బైరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Baireddy Rajasekhar Reddy
కర్నూలు: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షిపై కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాక్షి ఓ చెత్త పేపరు అని అన్నారు. సాక్షి పేపరు కొంటే ఎక్కువ తూకానికి అమ్ముడు పోతుందనే చాలామంది ప్రజలు కొంటున్నారన్నారు. సాక్షిలో నిజమైన వార్త ఒక్కటి ఉండదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సాక్షి పత్రికకు వచ్చిన ప్రకటనలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

వైఎస్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆస్తిని అక్రమంగా దోచుకున్నదన్నారు. వైఎస్ అక్రమార్జనతో రాష్ట్రాన్ని లూటీ చేశారన్నారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని పలువురు పెద్దలకు వివిధ రూపాల్లో లాభాలు చేకూర్చి వారితో సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టించారన్నారు. సాక్షిలో టిడిపిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వరద ముంపు పరిహారం తాను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయని, తాను ఆ పరిహారం తీసుకున్నట్టు నిరూపిస్తే సాక్షి కార్యాలయం ముందు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X