హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్, టిఆర్ఎస్‌ తో మ్యాచ్ ఫిక్సింగ్, సబ్బం వ్యాఖ్యలే నిదర్శనం: దేవేందర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devender Goud
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేసి రాష్ట్రంలో బలం పెంచుకోవాలని చూస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ బుధవారం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఆటు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితితో, ఇక్కడ సీమాంధ్రలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫిక్సింగ్ చేసుకొని డ్రామా ఆడుతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తన పట్టు పెంచుకోవడానికి టిఆర్ఎస్‌ను, అటు జగన్‌ను ఉపయోగించుకుంటున్నారన్నారు.

జగన్‌ అడుతున్న జగన్నాటకమంతా అధిష్టానం అడిస్తుందేనన్నారు. కాంగ్రెస్, జగన్ డ్రామా విషయం స్ఫష్టంగా కనిపిస్తుందన్నారు. అందుకు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X