హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతరానికి సవాళ్లు ఎదుర్కొనే సత్తా ఉంది: పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: నేటి యువతరానికి సవాళ్లను ఎదుర్కొనగలగే సత్తా ఉందని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి బుధవారం అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. నేటి యువత సవాళ్లను ఎదుర్కొనడానికి భయపడటం లేదన్నారు. వారు సవాళ్లను ఎదుర్కొవడానికే ఇష్టపడతారన్నారు. 62 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం శోచనీయమన్నారు.

ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రదేశంగా నిలపాలని ఆయన అన్నారు. భారత్‌ను అగ్రదేశంగా చూడాలంటే పాలకులు రాజకీయాలపై దృష్టి తగ్గించి అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.కార్యక్రమంలో చిరంజీవితోపాటు పార్టీ సీనియర్‌ నేతలు కోటగిరి విద్యాధరరావు, సి. రామచంద్రయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సంర్భంగా చిరంజీవి రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు తెలిపరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X