భానుతో పాటు గుర్గావ్లో ఉన్నా, తర్వాత పారిపోయి వచ్చా: మన్మోహన్

మద్దెలచెర్వు సూరిని భానుకిరణ్ చంపిన విషయం తనకు తెలియదని మన్మోహన్ తన వాంగ్మూలంలో చెప్పాడు. సాయంత్రం ఆరు గంటలకు తనను కూకట్పల్లిలో ఉండమన్నాడని, అనంతరం 6.30 గంటల ప్రాంతంలో భాను మరొకరితో వచ్చాడని చెప్పాడు. తాను భానుకిరణ్, లోకనాథ్తో కలిసి షోలాపూర్ వెళ్లినట్లు చెప్పాడు. భానుకిరణ్, తాను కలిసి షోలాపూర్ నుండి పూణె వెళ్లినట్లు చెప్పాడు. పూణే నుండి ముంబయి మీదుగా గ్వాలియర్ వెళ్లామని చెప్పాడు. ఆ తర్వాత 8వ తేదిన ఉండే ప్రాంతాన్ని మార్చాలని భానుకిరణ్ యోచించినట్లు చెప్పాడు. ఇద్దరూ గ్వాలియర్ నుండి ఢిల్లీ మీదుగా గుర్గావ్ చేరుకున్నారు.
గుర్గావ్లో ఓ పేయింగ్ గెస్ట్ హవుస్లో ఉండేవారు. ప్రతిరోజు గుర్గావ్ నుండి ఢిల్లీ వచ్చి తెలుగు పత్రికలు చదువుతూ, సినిమాలు చూస్తూ ఉండేవారు. అనంతరం తిరిగి గుర్గావ్ వెళ్లేవారు. తాము ఇద్దరం అక్కడ ఉన్నట్టు ఎవరికీ చెప్పవద్దని తనను భానుకిరణ్ హెచ్చరించాడని చెప్పారు. తన గురించి పత్రికలలో వస్తున్న వార్తలను చూసుకుంటూ భాను ఎంజాయ్ చేసేవాడని మన్మోహన్ చెప్పాడు. అయితే తనకు తెలుగు రానందున పత్రికలలో ఏం వస్తుందో తనకు తెలియకుండా ఉండేదన్నారు.
ఒకరోజు తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడినట్టు మన్మోహన్ చెప్పారు. ఆ విషయం తెలిసిన భాను తనను చంపుతానని హెచ్చరించాడు. దీంతో తాను భయపడి ఈ నెల 20వ తారీఖున సాయంత్రం 4గంటల ప్రాంతంలో తన భానుకి చెప్పకుండా తన ఊరికి పారిపోయానని చెప్పాడు. ఆ తర్వాత 23వ తారీఖున పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులను తాము విడిది చేసిన ప్రాంతానికి తీసుకు వెళ్లానని, అయితే అప్పటికే భాను అక్కడినుండి తప్పించుకున్నాడని చెప్పారు.
కాగా భానుకిరణ్తో ఇన్నాళ్లూ మన్మోహన్ ఉన్నందువల్ల కొంచె ధైర్యంగా ఉండేవాడని పోలీసులు భావిస్తున్నారు. ఉత్తరాది వాడైన మన్మోహన్ తనతో ఉండటం వల్ల చాలా సులభంగా తప్పించుకున్నాడని, అయితే మన్మోహన్ ఆయనతో విభేదించి పోలీసులకు చిక్కడంతో భానుకు ఇప్పుడు అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. మన్మోహన్ దొరికినందువల్ల భాను త్వరలోనే దొరికే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో భాను అరెస్టు అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మన్మోహన్ వాంగ్మూలంతో 20వ తేది వరకు ఢిల్లీ పరిసరాల్లో ఉన్న భాను ఇప్పుడు ఎక్కడున్నాడా అని వెతికే ప్రయత్నాల్లో పడ్డారు. అయితే మధురలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications