నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేకపాటి పార్టీకి దూరమవుతున్నారని బాధపడుతున్నా: మంత్రి ఆనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mekapati Rajamohan Reddy
నెల్లూరు: పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని తాను విమర్శించలేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం అన్నారు. తాను మేకపాటి గురించి మాట్లాడలేదన్నారు. అయితే కాంగ్రెసు పార్టీకి నష్టం చేస్తున్న పార్లమెంటు సభ్యుల గురించి మాత్రమే తాను వ్యాఖ్యానించానన్నారు. ఆయనపై తనకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. ఆయన కాంగ్రెసు పార్టీనుండి వెళ్లిపోయిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరవుతూ క్రమంగా పార్టీకి దూరమవుతున్నారనే బాధ తనకు ఎంతగానో ఉందన్నారు. పార్టీ కష్టాల్లో ఉంటే ఆదుకుంటామని చెప్పిన మేకపాటి వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి ఎప్పుడూ నేను విధేయుడినేనన్నారు. నిత్యం ఆయన చిత్రపటానికి నమస్కరించందే దినచర్యను ప్రారంభించనని చెప్పారు. రచ్చబండ కార్యక్రమంలో 96 శాతం మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. ఉద్యోగుల నిధులను రచ్చబండ కార్యక్రమానికి మరల్చుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయని, అయితే అందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఉద్యోగుల పీఆర్సీకి నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం ఉండదన్నారు. కాగా రచ్చబండ కార్యక్రమం అన్ని చోట్ల విజయవంతం అవుతుందన్నారు. కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రం ఆటంకం కలుగుతుందని చెప్పారు. రచ్చబండ కార్యక్రమానికి ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలను కేటాయించిందని, అందులో 1200 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X