విశాఖపట్నంలో భాను అచూకీపై ఆకాశరామన్న లేఖ కలకలం

Bhanu Kiran
విశాఖపట్నం: మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్ ఆచూకీపై విశాఖపట్నంలో కలకలం సృష్టించింది. ఓ ఆకాశరామన్న లేఖ ఈ కలకలానికి కారణమైంది. బుధవారం రాత్రి మీడియా కార్యాలయాల బాక్సుల్లో ఆ ఆకాశ రామన్న లేఖలను వదిలి వెళ్లారు. భాను కిరణ్ సూరి హత్య జరిగిన మరుసటి రోజు నుంచి విశాఖపట్నంలోని కిర్లంపూడిలో ఉన్నాడంటూ ఆ లేఖలో ఆగంతకుడు తెలిపాడు. భాను కిరణ్ ఉంటున్నట్లు చెబుతున్న నాలుగు ఆపార్టుమెంట్ల పేర్లను కూడా ఆగంతకుడు ఆ లేఖలో తెలిపాడు.

ఆకాశరామన్న లేఖతో విశాఖపట్నంలో పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. అపార్టుమెంట్లలో సోదాలు నిర్వహించారు. ఆ ఆపార్టుమెంట్లలో కొత్తగా చేరినవారి వివరాలు సేకరించారు. భాను కిరణ్ గతంలో విశాఖపట్నంలో కూడా భూముల సెటిల్మెంట్లు జరిపాడని ఆరోపణలున్నాయి. అయితే, మీడియాను, పోలీసులను తప్పు దారి పట్టించడానికే ఆ ఆకాశ రామన్న లేఖ రాశారని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+