చిరు భేటీకి ఇద్దరు డుమ్మా, 15 మంది ఎమ్మెల్యేల హాజరు

ఇక వైయస్ జగన్ వర్గానికి చెందిన శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డిలకు ఆహ్వానం పంపినప్పటికీ వారు సమావేశానికి గైర్హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో మేం పీఆర్పీలో ఉన్నప్పటికీ చిరంజీవి సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదని చెప్పే తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు అనీల్, మహేశ్వరరెడ్డి సైతం సమావేశానికి హాజరయ్యారు. గతంలో చిరంజీవి సమావేశం నిర్వహించిన సమయంలో పదిమంది లోపు ఎమ్మెల్యేలు హాజరయ్యేవారు. ఈసారి పదిహేనుమంది హాజరు కావడం మంత్రివర్గంలో చోటు కోసమేనంటూ పలువురు భావిస్తున్నారు. కాంగ్రెసు ఆఫర్పై నిర్ణయాన్ని చిరంజీవికి అప్పగిస్తూ ప్రజారాజ్యం విస్తృతస్థాయి సమావేశం నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications