టిడిపి ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీలపై ఐటి అధికారుల దాడులు

Nama Nageswara Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు కంపెనీలపై, ఇళ్లపైన శుక్రవారం ఐటి దాడులు నిర్వహించింది. నామా నాగేశ్వరరావు ఆస్తిపై గత కొద్దికాలంగా నిఘా ఉంచారు. నామా తన ఆస్తులకు పూర్తిగా ఆదాయ పన్ను కట్టనట్టుగా భావించి ఐటి దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే నామాపై ఇలా అనుకోకుండా దాడులు జరుగుతాయని ఎవరూ ఊహించకపోవడం గమనార్హం. ఐటి అధికారులు మూడు బృందాలుకు విడిపోయారు. ఒక బృందం హైదరాబాదులోని నామాకు చెందిన మధుకాన్ కంపెనీపై, ఖమ్మంలో మరియు జిల్లాలోని నేలకొండపల్లిలోని మధుకాన్ కంపెనీలపై దాడులు చేశారు.

అయితే దాడులకు, రాజకీయాలకు సంబంధం లేదని పలువురు భావిస్తున్నారు. నామా గతంలోకంటే టాక్సు తక్కువ కట్టారు. అయితే ఆయనకు కాంట్రాక్టులు తక్కువ అయి టాక్సు తక్కువ కట్టారా లేదా అనే విషయం ఈ దాడులలో బయటకు రానుంది. దేశంలోనే టాప్ మోస్టు ఎంపీల జాబితాలో నామా నాగేశ్వరరావు రెండు, మూడు స్థానాల్లో ఉంటారు. ఎన్నికల సమయంలో కూడా ఆయన తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. 10వేల కోట్ల కన్స్రక్షన్‌లే ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్ రెడ్డి, నామా నాగేశ్వరరావులు పెద్దమొత్తంలో అడ్వాన్సు టాక్సు కట్టారు. కాగా కేవలం హైదరాబాదు, ఖమ్మంలోనే కాకుండా ముంబయి, చెన్నై, కలకత్తాలోని ఆయన కంపెనీలపై కూడా దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

కాగా నామా నాగేశ్వరరావు ఆస్తులపై దాడిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు కుట్రగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో ఈ దాడులు చేయిస్తుందన్నారు. ఆయన పార్టీలోకంటే ముందుగానే కోట్లాది రూపాయల ఆస్తిపరుడన్నారు. రాజకీయాలతో ఆయన సంపాదించింది ఏమీ లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+