వైయస్ జగన్‌పై మరోసారి దండెత్తిన రామోజీ రావు ఈనాడు డైలీ

Eenadu
హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రిక మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌ కుంభకోణంలో జగన్, కెవిపి రామచందర్ రావు పాత్రలపై సవివరమైన వార్తాకథనాన్ని ఈనాడు శనివారం ప్రచురించింది. ఎమ్మార్‌లో జగన్ ఫలహారం అనే శీర్షిక కింద ఈ వార్తాకథనాన్ని ఈనాడు ప్రచురించింది. "రాజధాని నగరంలో అత్యంత ఖరీదైన నానక్‌రామ్‌గూడలోని విలాసవంతమైన విల్లాలను కొల్లగొట్టేందుకు జరిగిన భారీ 'ఎమ్మార్‌' కుంభకోణంలో.. వై.ఎస్‌.జగన్‌ పాత్ర స్పష్టంగా బయటపడుతోంది. తరచి చూసిన కొద్దీ.. ఈ కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దలు.. వారి సన్నిహితులు ఎంతకు తెగబడ్డారో, నేరుగా ఏ స్థాయిలో కోట్లు కొట్టేశారో అర్థమవుతుంది. ఈ అక్రమంలో వైఎస్‌ తనయుడు జగన్‌, వైఎస్‌ సన్నిహితుడు కేవీపీ, ఆయన వియ్యంకుడు కె.రఘు.. ఇలా బీరకాయ పీచు సంబంధాలన్నీ బరి తెగించాయి" అని ఈనాడు దినపత్రిక వ్యాఖ్యానించింది.

"ఒక దొంగ కంపెనీని సృష్టించడం ద్వారా మొత్తం 4,098 గజాల విస్తీర్ణం కల రెండు విల్లా స్థలాలను వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి కొట్టేశారు. ఇందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ రెండు స్థలాల విలువ కనీసం రూ.20.49 కోట్లు ఉంటుందని అంచనా. విశేషమేమంటే వీటి కోసం రికార్డు ప్రకారం నామమాత్రంగా చెల్లించాల్సిన రూ.2.1 కోట్లను సైతం జగన్‌ తన చేతి నుంచి పెట్టలేదు. ఆ ఖర్చును వైఎస్‌ ప్రభుత్వం నుంచి భూమి పొందిన ఒక కార్పొరేట్‌ లబ్ధిదారుడి ఖాతాలో వేసి.. అతనితోనే కట్టించేసినట్టు ఆధారాలను బట్టి స్పష్టమవుతోంది" అని ఈనాడు ఆరోపించింది.

"వైఎస్‌ సర్కారులో సలహాదారుడి అవతారమెత్తి కేవీపీ రామచంద్రరావు చక్రం తిప్పుతుంటే.. ఆయన వియ్యంకుడు ఎమ్మార్‌లో భారీగా దందా నడిపించినట్టు స్పష్టమవుతోంది. అడ్వాన్సు అడక్కుండానే.. ఎటువంటి చెల్లింపులూ లేకుండానే ఎమ్మార్‌లో ఒక విల్లాను కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు కె.రఘుకు కేటాయించినట్లు బయటపడింది. రఘు కుటుంబానికి మొత్తం నాలుగు విల్లా స్థలాలు, మరో నిర్మాణం పూర్తయిన విల్లా ఉన్నాయి. ఇక కేవీపీ రామచంద్రరావు భార్య పేరుతో మరో విల్లా స్థలం ఉంది" అని ఈనాడు వివరించింది.

సాక్షాత్తూ విజిలెన్స్‌ అంచనాల ప్రకారం.. ఎమ్మార్‌ విల్లాల విక్రయంలో జరిగిన లూటీ దాదాపు రూ.817 కోట్లు!! ఎంతలేదన్నా గజం రూ.50 వేల పలికే విల్లా స్థలాలను గజం రూ.5 వేలకు అమ్మినట్లు రికార్డులలో చూపి.. మిగిలిన రూ.45 వేలను అనధికారికంగా ఢిల్లీలో వసూలు చేసినట్టు బయటపడటం కీలకమైన అంశమని ఈనాడు వ్యాఖ్యానించింది. ఈ లూటీ ఎలా జరిగిందనే విషయాన్ని కూడా ఈనాడు సవివరంగా చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+