భగ్గుమంటున్న తాడిపత్రి.. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి.. ఎవరూ తగ్గట్లేదుగా!

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్తతలు చల్లారటం లేదు. తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు నిర్వహించిన ర్యాలీలు తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. తెదేపా విజయోత్సవ ర్యాలీ మరియు 'వెన్నుపోటుకు రెండేళ్లు' అనే పేరుతో వైసీపీ ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమాలు ఒకేసారి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది.వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేతృత్వంలోని ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి

అయినప్పటికీ పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుని, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు తాడిపత్రి మున్సిపల్ మాజీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో టీడీపీ నాయకులు, వైసీపీ నాయకుల దౌర్జన్యాలపై నిరసన తెలుపుతూ పెద్దారెడ్డి ఇంటి వద్దకు ర్యాలీగా చేరుకున్నారు.

Tadipatri politics creates tension as TDP Victory Rally and YSRCP protest programs clash police alert

పోలీస్ స్టేషన్ వద్ద మంచం వేసుకుని నిరసన తెలిపిన జేసీ ప్రభాకర్ రెడ్డి

గత ప్రభుత్వ కాలంలో తన ఇంటిపై దాడి చేసినట్లు ఆరోపిస్తూ పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి సహా 24 మందిపై నాన్‌-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో భాగంగా పోలీస్ స్టేషన్ వద్ద మంచం వేసుకుని పడుకోవడం, స్నానం చేయడం, వంటా వార్పు చేయడానికి సిద్ధమవడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత సీఐ సమాధానం చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పోలీసులు కాంట్రాక్టు హత్యలను ప్రోత్సహిస్తున్నారని పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

పెద్దారెడ్డి ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తూ పోలీసులు తమకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఖండించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వం మరియు పోలీసు వ్యవస్థపై తీవ్ర నినాదాలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ పోలీసులు కాంట్రాక్టు హత్యలను ప్రోత్సహిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనలు స్థానిక రాజకీయాల్లో ఉన్న ఉద్రిక్తతను మరోసారి బయటపెట్టాయి.

హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ కు షాక్.. రూ.50వేల జరిమానా విధించిన హైకోర్టు!
హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ కు షాక్.. రూ.50వేల జరిమానా విధించిన హైకోర్టు!

తాడిపత్రిలో నువ్వా నేనా అన్నట్టు ఫైట్

తాడిపత్రి పట్టణంలో రెండు ప్రధాన పార్టీల మధ్య జరిగిన ఈ ఘర్షణాత్మక సంఘటనలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ప్రస్తుత ప్రభుత్వ కాలంలో వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తుండగా, వైసీపీ నాయకులు పోలీసు చర్యలు టీడీపీకి అనుకూలంగా కక్ష సాధింపు చర్యలని ఆరోపణలు వస్తున్నాయి.ఈ ఘటనలు స్థానిక ప్రజల మధ్య కూడా చర్చనీయాంశమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+