హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిఆర్ఎస్ విలీనంపై సోనియానే కల్పించుకోవాలి: మధు యాష్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: ప్రజారాజ్యం తరహాలో తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెసు‌లో విలీనం కావాలంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియగాంధీ కలుగజేసుకోవాల్సి ఉంటుందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ శుక్రవారం అన్నారు. విలీనం కోసం రాష్ట్రస్థాయి నేతలతో కాకుండా సోనియా కలుగజేసుకోవాలని చెప్పారు. కెసిఆర్ తన పార్టీని కాంగ్రెసు‌లో విలీనం చేసే అంశం తెలంగాణ ఏర్పాటుపై ఆధారపడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా సంకేతాలు ఇస్తే కెసిఆర్ కాంగ్రెసు పార్టీలో తన పార్టీని విలీనం చేయడానికి ఆలోచించక పోవచ్చునన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పునర్నిర్మాణం కేంద్రం చూసుకుంటుందని చెప్పారు. కెసిఆర్ పునర్నిర్మాణం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు.

శ్రీకృష్ణ కమిటీ కేవలం సంప్రదింపుల కమిటీ మాత్రమేనని చెప్పారు. కేవలం అనుమానాలు నివృత్తి చేయడానికి మాత్రమే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 14న తెలంగాణ పార్టీకి చెందిన కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎంపీలు కోర్ కమిటీతో భేటీ అవుతారని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా మధుయాష్కీ శుక్రవారం ఉదయం బ్రిటన్ హై కమిషనర్‌తో హైదరాబాదులో భేటీ అయ్యారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించుకున్నారు.

English summary
MP Madhu Yashki suggested AICC president Sonia Gandhi to intervene to merge TRS in Congress. Separate Telangana issue is only problem to TRS merger, he said. He assured for reconstruction Telangana after separate is formed. He said that Srikrishna Report is not final. MP has met Britain High Commissioner today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X