వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వాసంతో అడుగులు: ప్రణబ్‌తో భేటీ అయిన తెలంగాణ ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress MLAs
న్యూఢిల్లీ: తాము విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తున్నామని కాంగ్రెసు తెలంగాణ శానససభ్యులు, ఎమ్మెల్సీలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గురువారం కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమైన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తప్పనిసరిగా తెలంగాణ సాధించుకుంటామనే నమ్మకం ఉందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. తమ ప్రయత్నంలో రంధ్రాన్వేషణ కూడదని ఆయన సూచించారు. ప్రజల కోరికకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధన తమ బాధ్యతగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.

తెలంగాణ అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఢిల్లీ నుంచి కదలబోమని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు 30 మంది ఢిల్లీలో మకాం వేశారు. వారు పార్టీ అధిష్టానానికి చెందిన కోర్ కమిటీ సభ్యులతో సమావేశమవుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాము సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కోర్ కమిటీ సభ్యుడు ఆంటోనీ, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీలతో సమావేశమైనట్లు, తమ మనోభావాన్ని సోనియాకు వినిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు.

English summary
Congress Telangana region MLAs and MLCs met Union Minister Pranab Mukharjee today, appealed to announce statehood for Telangana. The expressed confidence that they will achieve Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X