వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఖాయం, మా లక్ష్యం నెరవేరింది: టి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress MLAs
న్యూఢిల్లీ: పార్టీ అధిష్టానం నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై హామీ కోసం వచ్చిన ఢిల్లీ లక్ష్యం నెరవేరిందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు శుక్రవారం విలేకరులతో అన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానుండి స్పష్టమైన హామీ లభించిందన్నారు. గత డిసెంబర్ 9న కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటుందనే అభిప్రాయం మాకు కలిగిందన్నారు. త్వరలో తెలంగాణ ఖాయమని మాకు కనిపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులతో భేటీ అయిన మాకు వారినుండి స్పష్టమైన హామీలు లభించాయని చెప్పారు.

రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ, కేంద్ర హోంమంత్రి చిదంబరం, జనార్ధన్ ద్వివేది తదితరులతో భేటీ ఆయ్యామని వారంతా తెలంగాణకు సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో కోర్ కమిటీలో తెలంగాణపై చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు. కోర్ కమిటీ ద్వారా గత వాగ్ధానాలు నెరవేర్చుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ తెలంగాణపై స్పష్టమైన హామీ ఇచ్చినందువల్లే తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పార్టీలతో అఖిలపక్షం నిర్వహిస్తామని చిదంబరం చెప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత కేంద్రం ఏకాభిప్రాయానికి వస్తుందని అన్నారు.

English summary
Telangana Congress MLAs and MLCs hoped that Central Government will announceTelangana soon . They said home minister chidambaram promised diccussion will be held in core committe meeting on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X