వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ తీరుపై ఆద్వానీ అసంతృప్తి: సీమాంధ్రులను కలుపుకు వెళ్లాలని సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

LK Advani
హైదరాబాద్: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై దాడి, గవర్నర్ నరసింహన్ ప్రసంగ ప్రతులు చించివేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల పట్ల భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ అవినీతిపై మహా పోరాటం అనంతరం ఆయన న్యూఢిల్లీ వెళుతున్నప్పుడు శంషాబాద్ ఎయిర్ పోర్టులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామిగౌడ్ తదితరులు కలిశారు. ఆ సమయంలో అద్వానీ అసెంబ్లీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణకు బిజెపి కట్టుబడి ఉందని, బిజెపి మూడు రాష్ట్రాలను ప్రకటించినప్పుడు ఎలాంటి దాడులకు ఆస్కారం లేదని, ప్రశాంత వాతావరణంలో ప్రత్యేక రాష్ట్రాన్ని అక్కడివారు సాధించుకున్నారని, అయితే తెలంగాణ ఎమ్మెల్యేలు ఇలాంటి దాడికి పూనుకొనడం సరికాదని చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రశాంత వాతావరణంలో పోరాడాలని, సీమాంధ్ర ప్రజలను వ్యతిరేకించడం సరికాదని, వారిని కలుపుకొని వెళ్లాలని, ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తించవద్దని వారికి సూచించినట్టుగా తెలుస్తోంది. దాడులతో ఉద్యమం నీరుగారుతుందని, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కావద్దని ఆయన వారికి సూచించారు. వ్యతిరేక దృక్ఫతంతో ఉద్యమాలు చేయకూడదని, అలా అయితే ఇబ్బందులు వస్తాయని, సీమాంధ్రులను కలుపుకొని వెళ్లి ఉద్యమించండని అని వారికి సూచించారు.

2014లో బిజెపి అధికారంలోకి వస్తుందని, తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఇస్తుందని కానీ రెండువైపుల ప్రాంతాల ప్రజలను ఇబ్బందులకు మాత్రం గురి చేయవద్దని సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వారు వ్యతిరేకించే పరిస్థితి వస్తుందని చెప్పారు. సహాయ నిరాకరణ గూర్చి కూడా ప్రశ్నించగా సీమాంధ్ర ఉద్యోగుల మద్దతు ఉందని వారు చెప్పారు. కాగా టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ అద్వానీ అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పటికీ ఆయన పుట్టిన రోజు కారణంగా రాలేక పోయారు. దీనిని ఎమ్మెల్యేలు అద్వానీకి చెప్పారు.

English summary
BJP senior leader LK Advani teached a lesson to TRS leaders, who met him in Shamshabad airport at late night on 
 
 attack on JP. Eetela Rajendar, Harsish Rao, Kodandaram met him. He said BJP committed for Telangana. He 
 
 suggest them do not repeat such things.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X