టీఆర్ఎస్ తీరుపై ఆద్వానీ అసంతృప్తి: సీమాంధ్రులను కలుపుకు వెళ్లాలని సూచన

తెలంగాణకు బిజెపి కట్టుబడి ఉందని, బిజెపి మూడు రాష్ట్రాలను ప్రకటించినప్పుడు ఎలాంటి దాడులకు ఆస్కారం లేదని, ప్రశాంత వాతావరణంలో ప్రత్యేక రాష్ట్రాన్ని అక్కడివారు సాధించుకున్నారని, అయితే తెలంగాణ ఎమ్మెల్యేలు ఇలాంటి దాడికి పూనుకొనడం సరికాదని చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రశాంత వాతావరణంలో పోరాడాలని, సీమాంధ్ర ప్రజలను వ్యతిరేకించడం సరికాదని, వారిని కలుపుకొని వెళ్లాలని, ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తించవద్దని వారికి సూచించినట్టుగా తెలుస్తోంది. దాడులతో ఉద్యమం నీరుగారుతుందని, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కావద్దని ఆయన వారికి సూచించారు. వ్యతిరేక దృక్ఫతంతో ఉద్యమాలు చేయకూడదని, అలా అయితే ఇబ్బందులు వస్తాయని, సీమాంధ్రులను కలుపుకొని వెళ్లి ఉద్యమించండని అని వారికి సూచించారు.
2014లో బిజెపి అధికారంలోకి వస్తుందని, తెలంగాణ రాష్ట్రం తప్పకుండా ఇస్తుందని కానీ రెండువైపుల ప్రాంతాల ప్రజలను ఇబ్బందులకు మాత్రం గురి చేయవద్దని సూచించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే వారు వ్యతిరేకించే పరిస్థితి వస్తుందని చెప్పారు. సహాయ నిరాకరణ గూర్చి కూడా ప్రశ్నించగా సీమాంధ్ర ఉద్యోగుల మద్దతు ఉందని వారు చెప్పారు. కాగా టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ అద్వానీ అపాయింట్మెంట్ తీసుకున్నప్పటికీ ఆయన పుట్టిన రోజు కారణంగా రాలేక పోయారు. దీనిని ఎమ్మెల్యేలు అద్వానీకి చెప్పారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications