ఐఎఎస్ అధికారి వినీల్ కృష్ణ కిడ్నాప్లే ఆంధ్ర మావోయిస్టుల పాత్ర?
కాగా, ఒరిస్సా ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య మధ్యవర్తులుగా పనిచేయడానికి తెలుగు ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ హరగోపాల్, ఆర్ఎస్ రావు హైదరాబాదు నుంచి బయలుదేరుతున్నారు. అయితే, మావోయిస్టులు గడువు పెంచాలని హరగోపాల్ కోరుతున్నారు. ప్రభుత్వం కూడా కొంత దిగిరావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మావోయిస్టుల డిమాండ్ల పరిష్కారానికి ఒరిస్సా ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఆయన చెప్పారు. మావోయిస్టుల్లో కొందరిని చట్టపరిధిలో విడుదల చేయడానికి అవకాశం ఉందని ఆయన అన్నారు. తెలుగు ప్రాంతానికి చెందిన తమ సహచరులు సుదర్శన్, రామకృష్ణ భార్య పద్మక్క, గంటి ప్రసాద్లను విడుదల చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.
వినీల్ కృష్ణ కిడ్నాప్లో గాజర్ల రవి, దుబాయ్ శంకర్ వంటి ఆంధ్రప్రదేశ్కు చెందిన మావోయిస్టులు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, డెడ్లైన్ పెంచాలని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా మావోయిస్టులను కోరారు.