హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనకు వైయస్ జగన్ ఉన్నాడు, కలిసి పోరాడుదాం: రోజా

By Pratap
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: మనకు వైయస్ జగన్ ఉన్నాడని, జగన్‌తో కలిసి పోరాటం చేద్దామని సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లింపు కోసం చేపట్టిన దీక్షా వేదిక నుంచి ఆమె శుక్రవారం మాట్లాడారు. ఫీజుల రీయంబర్స్‌మెంట్ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె సూచించారు. వరలక్ష్మి ఆత్మహత్యే మొదటిదీ చివరిదీ కావాలని ఆమె అన్నారు. విద్యార్థుల కలలను వైయస్ జగన్ కచ్చితంగా సాకారం చేస్తారని ఆమె అన్నారు.

ఫీజుల రీయంబర్స్‌మెంట్ కోసం పక్క రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాలని, ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజుల రీయంబర్స్‌మెంట్ చెల్లింపు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. వైయస్సార్ పథకాలను కొనసాగిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తోందని ఆమె అన్నారు. పరీక్షలు రాయాల్సిన సమయంలో విద్యార్థులు ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం ఆందోళనలకు దిగుతున్నారని ఆమె అన్నారు.

English summary
Actress and political leader Roja said that we should fight for fee reimbursement under the leadership of YS Jagan. He 
 
 appealed to the students to do not commit suicides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X