హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం టిడిపి, టిఆర్ఎస్ పట్టు: సభ రేపటికి వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా మూడో రోజు కూడా గందరగోళం మధ్యన డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. అప్పటికే సభను మూడు సార్లు వాయిదా వేసినప్పటికీ ఫలితం లేక పోవడంతో నాలుగోసారి రేపటికి వాయిదా వేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ తీర్మానానికి పట్టుబట్టడంతో నాదెండ్ల వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు తెలంగాణ మ్యాప్‌లతో కూడిన టీషర్టులు వేసుకు రావడం విశేషం.

కాగా సభ వాయిదా పడిన అనంతరం టిఆర్ఎస్‌ఎల్పీ ఈటెల రాజేందర్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తీర్మానం కోసం డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. తెలంగాణ కోసం ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తుంటే, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. విద్యార్థుల చలో అసెంబ్లీ కార్యక్రమం ర్యాలీపై లాఠీఛార్జ్ చేయడం శోచనీయం అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కిందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టే వరకు సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులకు అండగా 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు.

English summary
Deputy Speaker Nadendla Manohar adjourned Assembly session to tuesday. TRS and Telangana TDP demanded to Telangana resolution in assembly. TRSLP Etela blamed Congress government on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X