హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదల వీడాలి: ఎమ్మెల్యే కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా సోమవారం విద్యార్థులు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్, ప్రజా గాయకుడు గద్దర్‌ను అరెస్టు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఖండించారు. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిపై ప్రభుత్వం బలప్రయోగం చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. కాగా సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు కూడా గద్దర్ అరెస్టును ఖండించారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం అయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రసంగంలో తెలంగాణ అంశం లేకపోవడంపట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రసంగంలో తెలంగాణ అంశం లేకపోవడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. విద్యార్థుల ఛలో అసెంబ్లీని ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. చదువుకునే విద్యార్థులపో రబ్బరు బుల్లెట్లు ప్రయోగించడం, లాఠీఛార్జ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టి కేంద్రానికి పంపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెలంగాణ అంశంపై మొండివైఖరి విడనాడాలి అని కోరారు.

English summary
TRS president K Chandrasekhar Rao and Siricilla MLA K Taraka Rama Rao condemned TPF convener Gaddar arrest today. KTR demanded government to introduce Telangana resolution in Assembly. He accused president's speech without Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X