హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు వైఖరిపై సీమాంధ్ర తెలుగుదేశం ఎమ్మెల్యేల అసంతృప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ సమస్యపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వైఖరి పట్ల సీమాంధ్ర శానససభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై తమ పార్టీ తెలంగాణ నాయకులు శాసనసభలో దూకుడుగా వ్యవహరిస్తుండడంతో సభ నడవని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ శాసనసభ్యులకు అందుకు అవసరమైన స్వేచ్ఛను చంద్రబాబు ఇవ్వడం వల్లనే ఈ స్థితి నెలకొందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు.

శాసనసభలో తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులతో పాటు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. దీంతో శాసనసభ అర్థాంతరంగా వాయిదా పడుతోంది. ఈ స్థితిలో సభ జరుగుతున్న తీరు పట్ల తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల కోరిక మేరకు తీర్మానం ప్రతిపాదించాలని వారు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరాలని ఆలోచిస్తున్నారు. అయితే పార్టీపరంగా కాకుండా వ్యక్తిగతంగా డిప్యూటీ స్పీకర్‌కు ఆ విజ్ఞప్తి చేయాలనే ఆలోచనలో వారు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

English summary
It is learnt that TDP Seemandhra MLAs are expressing unhappy with attitude of Party president Chandrababu on Telangana issue. It is said that Chandrababu himself is encouraging Telangana MLAs to stall assembly proceedings on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X