హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై కాంగ్రెసు మీద దుమ్మెత్తిపోసిన రాములమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
న్యూఢిల్లీ‌: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించడానికి కాంగ్రెసు ముందుకు రాకపోవడంపై కాంగ్రెసుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి దుమ్మెత్తిపోశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెసు అందుకు సిద్ధం కాకపోతే ఈజిప్టు తరహా ఉద్యమం సాగుతుందని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కోటి మందితో ఆందోళనకు దిగుతామని ఆమె హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇంకా ఎన్ని రోజులు ఆపుతారని ఆమె అడిగారు. తెలంగాణ సాధన కోసం తాము చేయాల్సిందంతా చేస్తామని ఆమె చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెసుకు మర్యాదగా ఉంటుందని ఆమె అన్నారు. తెలంగాణ సాధన విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని, మిగతా పార్టీల సహకారం కూడా కోరుతున్నామని ఆమె చెప్పారు.

English summary
TRS MP Vijayashanthi lashed out at Congress for not proposing Telangana bill in Parliament. She warned that they will resort to Egypt type agitation, if centre fails to introduce Telangana bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X