హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై మార్చి 1తర్వాత తాడోపేడో తేల్చుకుంటాం: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణపై మార్చి 1వ తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. జై తెలంగాణ నినాదాలతో లోకసభ వాయిదా పడిన తర్వాత ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాము ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగాన్ని బహిష్కరిస్తామని, రేపటి రైల్వే బడ్జెట్‌ను కూడా బహిష్కరిస్తామని ఆయన చెప్పారు. నిన్న తెలంగాణపై గళమెత్తిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల నోళ్లకు ఈ రోజు ఎందుకు తాళాలు పడ్డాయో వారే చెప్పాలని ఆయన అన్నారు.

తెలంగాణపై తమకు ప్రతిపక్షాలన్నీ సహకరించాయని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌కు తాము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. మొదటి రోజు జెపిసి కోసం సహకరించాలని ప్రతిపక్షాలు అడిగాయని, ఆ తర్వాత తెలంగాణపై మీతో ఉంటామని చెప్పారని, దాంతో మొదటి రోజు తాము తెలంగాణపై పట్టుబట్టలేదని ఆయన వివరించారు. తెలంగాణపై పూర్తి స్థాయిలో పార్లమెంటును స్తంభింపజేద్దామని ప్రతిపక్షాలు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదన ముగిసే వరకు ఆగాలని తమను ఎన్‌డిఎ కోరిందని, దాంతో తాము ఆ తర్వాతే తెలంగాణ బిల్లు కోసం పట్టుబట్టాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు.

English summary
TRS president KCR said that they will fight for Telangana till the end. He told media persons after the adjournment of the Lokasabha that they will boycott PM's speech and Railway budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X