వైయస్ జగన్ నిద్ర పోరు, రాష్ట్రంలో మరో భారతం: రోజా, లక్ష్మీపార్వతి

జగన్ అతి తక్కువ కాలంలో అతి ఎక్కువమంది మదిని దోచుకున్నారన్నారు. జగనే తమ నాయకుడని ప్రజలు ప్రభుత్వానికి చెబుతున్నారన్నారు. ప్రభుత్వానికి ఇంకా ఎంతో దూరంలో నూకలు లేవన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఈ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోతుందన్నారు. జగన్ చేసిన దీక్ష అంతం కాదని, ఆరంభమే అని హెచ్చరించారు. ప్రజలందరికీ న్యాయం చేసే వరకు జగన్ అన్న నిద్రపోడని ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు న్యాయం చేస్తారని అన్నారు. ఈ సందర్భంగా రోజు వివేకానందస్వామి మాటలను గుర్తు చేశారు.
జగన్ దీక్షకు ప్రభుత్వం స్పందించకపోయినా విద్యార్థులు స్పందించారని సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ గురువారం అన్నారు. ప్రజలు, విద్యార్థుల ఆశయాలు ముందుకు తీసుకు వెళ్లగలిగే నాయకుడు జగన్ ఒక్కడే అన్నారు. ప్రజలందరి ఆశీస్తులతో జగన్ నాయకుడుగా మారారన్నారు. ప్రజల పక్షాన పోరాడగలిగే నాయకుడు జగన్ ఒక్కరే అన్నారు. వైయస్ పథకాన్ని నీరుగార్చడానికే ప్రభుత్వం చూస్తుందని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి అన్నారు. జగన్ మామూలు వ్యక్తి కాదన్నారు. రాష్ట్రంలో ఈరోజు మరో భారతం జరుగుతుందన్నారు. నాడు దృతరాష్ట్రుడు అరాచకాలను చూస్తే, ఈ రోజు కాంగ్రెస్ను రెండుసార్లు అధికారంలోకి వచ్చిన వైయస్ కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications