వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ, ధర్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ తాకింది. ఢిల్లీ పర్యటనకు వచ్చారని తెలుసుకున్న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, ఢిల్లీలోని జెఎన్‌యు విద్యార్థులు శనివారం ఉదయం కిరణ్ కుమార్ రెడ్డి బస చేసిన ఎపి భవన్ వద్ద ధర్నాకు దిగారు. విద్యార్థులు ఒక్కసారిగా కాకుండా విడివిడిగా వచ్చి వ్యూహాత్మకంగా ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మా తెలంగాణ మాకు కావాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పిస్తామని విద్యార్థులు చెప్పారు. అయితే, పోలీసులు అందుకు అనుమతించలేదు. విద్యార్థులను అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయించుకోవడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చారు. ఆయన మధ్యాహ్నం కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అవుతున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారు.

English summary
Osmania University students staged dharna in front of AP Bhavan, New Delhi demanding ormation of Telangana state. Knowing CM Kirankumar Reddy is residing in AP Bhavan students reached there and staged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X