వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాఫ్ట్‌వేర్‌కు ప్రణబ్ మొండిచేయి, ఎన్నారైలకు రూ. 81 కోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: 2011-12 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్‌లో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి మొండిచేయి చూపారనే చెప్పవచ్చు. రెండేళ్ళుగా డీలాపడిన ఐటీ రంగం పుంజుకునేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించాలని, పన్ను పరిమితి తగ్గించాలని సాఫ్ట్‌వేర్ రంగం చేసిన విజ్ఞప్తులను ప్రణబ్ పట్టించుకోలేదు. ఐటీ కంపెనీలకు పన్నులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. కనీస ఆల్టర్‌నేట్ ట్యాక్స్ (మ్యాట్)ను 18 నుంచి 18.5 శాతానికి పెంచడం సాఫ్ట్‌వేర్ నిపుణులను నిరుత్సాహానికి గురిచేసింది. కొత్త ఐటీ పార్కులకు అనుమతి ఇవ్వడం లేదని ప్రణబ్ తేల్చిచెప్పారు. మొత్తం మీద సాఫ్ట్‌వేర్ రంగానికి రాయితీలు లేకుండా హామీలతో ప్రణబ్ సరిపుచ్చారు.

కాగా, ప్రవాస భారతీయులకు 2011-12 బడ్జెట్‌లో భారీ వరాలేమీ కురిపించలేదు. గత ఏడాది కేటాయించిన మొత్తానికి రూ.8 కోట్లు అదనంగా చేర్చి రూ.81 కోట్లు కేటాయించారు. 2010-11 బడ్జెట్‌లో ఎన్నారైలకు రూ.73 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కేటాయించిన మొత్తంలో రూ.6 కోట్లను 'ప్రవాస భారతీయ దివస్" వేడుకల కోసం పద్దు చూపారు. ఈ ఏడాది ఆరంభంలో, జనవరి 7,8,9 తేదీల్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రవాస భారతీయ దివస్ వేడుకలు జరిగిన తెలిసిందే. ఆ మొత్తాన్ని బడ్జెట్‌లో లెక్కచూపారు. ఈ పద్దు పోను మిగిలిన రూ.75 కోట్ల బడ్జెట్‌లో ప్రవాస వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధారణ అవసరాల నిమిత్తం రూ.47.50 కోట్లను కేటాయించారు. ఇవన్నీ పోను ప్రవాస భారతీయుల సంక్షేమ కార్యక్రమాల కోసం ఉదారంగా రూ.9.20 కోట్లు ప్రతిపాదించారు.

English summary
Finance Minister Pranab Mukherjee's budget has almost all ignored IT sector. Pranab said that no IT parks will be 
 allowed further. He allocated 81 crores for NRIs in his Budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X