గ్యాస్ సంక్షోభం వేళ ప్రధాని మోదీ మాస్టర్ స్ట్రోక్.. రూ. 40 వేల కోట్లతో..!
సముద్రగర్భం గుండా ఒమన్ నుండి గుజరాత్ వరకు రూ. 40,000 కోట్ల భారీ గ్యాస్ పైప్లైన్ నిర్మాణానికి భారతదేశం ప్రణాళికలు రచిస్తోంది. హోర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇంధన సరఫరాలను సురక్షితం చేయడం, దిగుమతి ప్రమాదాలను తగ్గించడం, దేశీయ సహజ వాయువు డిమాండ్ను తీర్చడం ఈ ప్రాజెక్ట్ వెనుక ప్రధాన లక్ష్యాలు. దీని ద్వారా ఇంధన భద్రతను పెంపొందించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
అరేబియా సముద్రం గుండా ఒమన్ నుండి గుజరాత్కు సుమారు 2,000 కిలోమీటర్ల పొడవైన ఈ అండర్సీ గ్యాస్ పైప్లైన్ నిర్మించబడుతుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ లోతైన సముద్రపు పైప్లైన్ ప్రపంచంలోనే అత్యంత లోతైన గ్యాస్ పైప్లైన్లలో ఒకటిగా నిలవనుంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 3,450 మీటర్ల దిగువన పయనిస్తుంది.
హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న సంక్షోభం ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించడంతో భారత్కు పెద్ద ఆందోళనగా మారింది. దేశీయంగా దిగుమతి అయ్యే ముడి చమురులో 40 నుండి 50 శాతం వరకు, ఎల్పీజీలో దాదాపు 80 శాతం ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. ఈ పరిణామాలు ఇప్పటికే ఇంధన సరఫరాను ప్రభావితం చేయగా, సీఎన్జీ, పాలు, ఇతర నిత్యావసరాల ధరలను పెంచాయి.
భారతదేశంలో సహజ వాయువు డిమాండ్ ఏటా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం వినియోగం 190-195 mmscmdగా అంచనా వేయబడినప్పటికీ, 2030 నాటికి 300 mmscmdకి చేరవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దం ముగిసేలోపు ఎల్ఎన్జి దిగుమతులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఒమన్-గుజరాత్ పైప్లైన్ వంటి దీర్ఘకాలిక ఇంధన ప్రాజెక్టులపై ప్రభుత్వం తిరిగి దృష్టి సారించింది.

అధికారుల అంచనా ప్రకారం, ఈ పైప్లైన్ ప్రాజెక్ట్ ఆమోదం పొందితే, దీనిని పూర్తి చేయడానికి ఐదు నుండి ఏడు సంవత్సరాలు పడుతుంది. GAIL, ఇంజనీర్స్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ సంస్థలు సమగ్ర సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేయనున్నాయి. ఈ పైప్లైన్ ద్వారా భారత్ ఒమన్, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాన్, తుర్క్మెనిస్తాన్ నుండి గ్యాస్ నిల్వలను పొందగలదు. రాజకీయంగా సున్నితమైన మార్గాలను నివారించవచ్చు.












Click it and Unblock the Notifications