తెలంగాణ పరిష్కారం చంద్రబాబు చేతుల్లోనే ఉంది: బొత్స సత్యనారాయణ

సమైక్యాంధ్ర కోసం శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని తమ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రతిపాదన గురించి తనకు తెలియదని ఆయన అన్నారు. ఈ నెల 5వ తేదీన పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు నివాసంలో జరిగే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశానికి తనకు ఆహ్వానం లేదని ఆయన చెప్పారు. ప్రకటించిన ప్యాకేజీ ఇవ్వకపోవడం పల్లనే శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి ఘటన చోటు చేసుకుందని ఆయన చెప్పారు. ప్యాకేజీని ఇవ్వని ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రైవేట్ కంపెనీలు చేసే పనులు ప్రభుత్వానికి అంటగట్టడం సరి కాదని ఆయన అన్నారు. కాకరాపల్లి ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. కాకరాపల్లి బాధితులకు యాజమాన్యం క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు.
Comments
బొత్స సత్యనారాయణ చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర తెలంగాణ తెలుగుదేశం హైదరాబాద్ botsa satyanarayana chandrababu naidu united andhra telangana telugudesam hyderabad
English summary
Minister Botsa Satyanarayana said that solution for Telangana issue is in the hands of Telugudesam president N Chandrababu Naidu. He demanded Chandrababu to announce the later should announce to abide by Congress decision on Telangana.
Story first published: Tuesday, March 1, 2011, 14:05 [IST]