వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై నిర్ణయానికి సమయం పడుతుంది: చిదంబరం
తెలంగాణలో శాంతిని కాపాడాలని ఆయన రాజకీయ పార్టీలకు, తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు. ఓపిక లేకపోతే సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. తెలంగాణపై రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేమని ఆయన అన్నారు. ఆందోళనలు చేస్తూ పోతే సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు. వరదల తాకిడి ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల కోసం 440 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో 9 విప్లవ గ్రూపులతో శాంతి కోసం చర్చలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. శానససభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వంద కంపెనీల కేంద్ర బలగాలను పంపుతున్నట్లు ఆయన తెలిపారు.
Comments
English summary
Union Home Minister P Chidambaram said that Telangana issue is sensitive, so it takes time to take decision. He said that all party meeting with AP political parties on Telangana issue will be held after consulting opposition.
Story first published: Wednesday, March 2, 2011, 7:48 [IST]