తెలంగాణపై నిర్ణయానికి సమయం పడుతుంది: చిదంబరం

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం అత్యంత సున్నితమైందని, దానిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిశీలిస్తోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ అంశంపై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అయితే, సమావేశానికి తేదీ ఖరారు కాలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలతో మాట్లాడి తేదీని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి చెందిన ఎనిమిది రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరవుతారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణలో శాంతిని కాపాడాలని ఆయన రాజకీయ పార్టీలకు, తెలంగాణ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు. ఓపిక లేకపోతే సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. తెలంగాణపై రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేమని ఆయన అన్నారు. ఆందోళనలు చేస్తూ పోతే సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతుందని ఆయన అన్నారు. వరదల తాకిడి ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల కోసం 440 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో 9 విప్లవ గ్రూపులతో శాంతి కోసం చర్చలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. శానససభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వంద కంపెనీల కేంద్ర బలగాలను పంపుతున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+