హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై సోనియా చెప్తే 24 గంటల్లోగా బాబు చెప్తారు: దేవినేని ఉమ

By Pratap
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheswara Rao
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటన చేసిన 24 గంటల్లోగా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు చెప్పారు. తెలంగాణపై ముందు సోనియా గాంధీ తన వైఖరిని వెల్లడించాల్సి ఉంటుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తమ అభిప్రాయానికి భిన్నంగా నిర్ణయం తీసుకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతామని ఆయన హెచ్చరించారు. తమను వలసవాదులుగా, దోపిడీదారులుగా అభివర్ణించడాన్ని ఆయన తప్పు పట్టారు. కొడితే వెళ్లిపోతారని ప్రకటనలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. తమపై తెలంగాణవాదులు బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. సమైక్యవాద ఉద్యమం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 3వ తేదీన తమ పార్టీకి చెందిన సీమాంధ్ర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమవుతారని ఆనయ చెప్పారు. సమైక్యాంధ్ర నినాదంతో సీమాంధ్ర తెలుగుదేశం శాసనసభ్యులు ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలుగుదేశం శాసనసభ్యుడు పుల్లారావు కూడా పాల్గొన్నారు.

English summary
TDP Seemandhra MLA Devineni Umamaheswara Rao said that if sonia Gandhi clarifies her stand on Telangana, within 24 hours his party president Chandrababu will announce. He said that he will not accept unilateral decision on Telangana issue by Union Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X