చంద్రబాబుతో జెసి దివాకర్ రెడ్డి భేటీ, తెలంగాణకు కౌంటర్ ప్లాన్

Chandrababu Naidu-JC Diwakar Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను ఎదుర్కోవడానికి కలిసి రావాలని రాయలసీమకు చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కోరారు. అనూహ్యంగా జెసి దివాకర్ రెడ్డి మంగళవారంనాడు చంద్రబాబును కలిశారు. సమైక్యాంధ్ర కోసం శానససభ సమావేశాలను బహిష్కరించాలనే తమ నిర్ణయానికి మద్దతు ప్రకటించి, తమతో కలిసి రావాలని తాను చంద్రబాబును కోరినట్లు జెసి దివాకర్ రెడ్డి భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే చంద్రబాబు ఏ విధమైన హామీ ఇవ్వలేదని ఆయన చెప్పారు.

సమైక్యాంధ్ర కోసం తమ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర శానససభ్యులు శాసనసభా సమావేశాలను బహిష్కరిస్తామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం లేదనే అభిప్రాయం ఢిల్లీలో వ్యక్తమవుతోందని, ఈ స్థితిలో తాము తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ నెల 5వ తేదీన తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమవుతారని ఆయన చెప్పారు. శాసనసభ సమావేశాల బహిష్కరణపై ఈ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని కాంగ్రెసు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశాలను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+