సాగు భూములు లాగేసిన ఘనత వైఎస్దే: టిడిపి అధినేత చంద్రబాబు
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి, కాంగ్రెసు ప్రభుత్వంలో ఎవరికైనా దమ్ము ఉంటే వట్టితాండ్రను సందర్శించాలని ఆయన సవాల్ చేశారు. అధికార ప్రభుత్వానికి సిగ్గు లేదన్నారు. మానవత్వంలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నారు. ప్రభుత్వానికి అమాయక ప్రజలను కాల్చే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రాజెక్టు సూత్రదారులు ఎవరో తేల్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలను రక్షిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వారిపై కక్ష్య తీర్చుకుంటున్నట్టుగా ప్రవర్తిస్తోందన్నారు.
ప్రభుత్వం బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జైళ్లో ఉన్న ఆందోళనకారులను వెంటనే విడుదల చేయాలన్నారు. కాల్పుల ఘటనపై విచారణ జరిపించాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.