ఎంపీ కావూరి సాంబశివరావు ఇంట్లో సీమాంధ్ర నేతల భేటీ జరిగేనా?
అంతేకాదు, లాయర్ల ముట్టడి అనంతరం విలేకరులతో మాట్లాడిన కావూరి తన ఇంట్లో భేటీ జరుగుతున్నట్టు ఎవరో చెబితే సరిపోతుందా నేను చెప్పానా అని విలేకరులను ప్రశ్నించారు. ఆ మాటలను బట్టే ఆయన తన ఇంట్లో భేటీకి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా భేటీ వద్దని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు స్పందించి మంత్రి జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు మంత్రులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా కావూరి మార్చి 5న తన ఇంట్లో భేటీ ఏర్పరిచే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీలోగానీ, మరే ఇతర ప్రాంతంలోగానీ వారు తమ సమావేశం నిర్వహించుకునే అవకాశం ఉంది.
English summary
It seems, Seemandhra leaders meeting will changed to another place from Eluru MP Kavuri Sambasiva Rao residence due to tension prevailed in state.
Story first published: Thursday, March 3, 2011, 11:01 [IST]