వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాలకు సమయం వస్తుంది: తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: తమ రాజీనామాలకు సమయం వస్తుందని, అప్పుడే రాజీనామాలు చేస్తామని తెలంగాణ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు శుక్రవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఎంపీలు వివేక్, మంద జగన్నాధం తదితరులు విలేకరులతో మాట్లాడారు. గురువారం నల్గొండ పార్లమెంటు సభ్యుడు రాజీనామాతో ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు వద్దకు వెళ్లారని అయితే కావూరి నేనేందుకు రాజీనామా చేయాలి అని వెనక్కి వెళ్లారని చెప్పారు. తాము కూడా గుత్తాకు రాజీనామాకు సమయం వస్తుందని చెప్పామని అన్నారు. అవసరం అయిన పక్షంలో అందరం కలిసి రాజీనామాకు సిద్ధమవుదామని చెప్పినట్లు వివరించారు.

లోక్‌సభలో సోమవారం నుండి తెలంగాణ కాంగ్రెసు ఎంపీలం పదకొండు మందిమి నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టే వరకు మా పోరాటాన్ని ఆపేది లేదని చెప్పారు. తెలంగాణ మంత్రులు కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్‌మెంట్ అడిగారన్నారు. దీనిపై ప్రణబ్‌ను అడిగినప్పుడు వారిని పిలిపించుకొని మాట్లాడుతానని హామీ ఇచ్చారన్నారు. తెలంగాణకు చెందిన అందరం ప్రజాప్రతినిధులం కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

English summary
Telangana MPs said that time will come for resignation. They said they will fight for Telangana in parliament till propose bill. They condemned Eluru MP Kavuri Sambasiva Rao comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X