వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాలా బాధేసింది, తెలంగాణపై చెప్పాలని ప్రణబ్‌ను కోరా: విజయశాంతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సమయం ఆసన్నమైందనే లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, తాను గొంతు విప్పామని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి శుక్రవారం ఓ టీవీ ఇంటర్య్వూలో చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలోని పది జిల్లాల్లో ఉద్యమం తీవ్రస్థాయిలో ఉందన్నారు. ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిందని చెప్పారు. స్పీకర్ మీరాకుమార్ పోడియం వద్దకు పరిస్థితులను అనుసరించి దూసుకు పోయానని చెప్పారు. తనకు సభలో తెలంగాణ తప్ప సస్పెన్షన్ భయమో మరేదో కనిపించడం లేదని చెప్పారు.

తెలంగాణ కోసం మాతో పాటు తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ ఉద్యమించాలని సూచించారు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులపై ముఖ్యంగా తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇప్పటిలాగే భవిష్యత్తులో కూడా తెలంగాణపై లోక్‌సభను స్తంభింపజేస్తామని చెప్పారు. తాము అంతగా నోరు విప్పి ఆందోళనకు దిగినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధేసిందని ఆమె చెప్పారు. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీని చేతులు జోడించి వేడుకున్నానని, ఏదో ఒకటి చెప్పాలని కోరానని ఆమె అన్నారు.

English summary
TRS MP Vijayashanthi suggested Telangana Congress MPs to support Telangana agitation. She said they will fight for telangana till propose Telangana bill in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X