గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాజా పరిస్థితి వల్ల రాష్ట్రపతి పాలనే మేలు: అంబటి రాంబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
గుంటూరు: ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో రాష్టపతి పాలన విధించడమే సరైన మార్గమని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్ర శాసనసభకు సభ్యులు రాకపోవడమే కాక రాష్ట్రంలో తీవ్రమైన రాజకీయ అనిశ్చితి నెలకొందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రానికి మంచిది కాదని, పాలనా వ్యవహారాలు స్తంభించిపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు.

ప్రస్తుత స్థితికి ఏకైక పరిష్కార మార్గం రాష్ట్రపతి పాలన విధించడమొక్కటేనని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో జరుగుతున్న ఉద్యమాల నేపధ్యంలో కేంద్రం సమస్యకు త్వరగా పరిష్కార మార్గం చూపాలని, లేదంటే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ కొత్తపార్టీ ప్రకటనకు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరుకల్లా పార్టీ ప్రకటన ఉంటుందని ఆయన చెప్పారు.

English summary
Ex MP YS Jagan camp leader Ambati Rambabu expressed his opinion that president rule should be imposed in state taking situation into consideration. He said that uncertainty prevailed in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X