జగన్ వర్గం కిడ్నాప్ చేసింది: హైకోర్టులో ఎంపిటిసి భార్య పిటిషన్

YS Jagan
హైదరాబాద్: తన భర్త వి. చిన వెంకట సుబ్బన్నను జగన్ వర్గం శాసనసభ్యుడు సి. ఆదినారాయణరెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసి నిర్బంధించారని ఎం పీటీసీ భార్య ఓబులమ్మ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి. ఈశ్వరయ్య, జస్టిస్ సూర్య అప్పారావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. బాధితుని ఆచూకీ కనుగొని ఈ నెల 7న హైకో ర్టు ముందు హాజరుపర్చాలని వైఎస్ఆర్ (కడప) జిల్లా ఎస్పీని డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఈ పిటిషన్‌లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.

స్థానిక సం స్థల ప్రతినిథుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దొమ్మ ర నంద్యాల గ్రామంలో రెండో ఎంపీటీసీ సభ్యుడైన తన భర్తను జమ్మలమడుగు ఎ మ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి అనుచరుడు లక్ష్మయ్య కిడ్నాప్ చేశారని పిటిషన్‌లో ఆమె ఆరోపించారు. తన చుట్టూ మనుషులను పెట్టి ఎటూ కదలనీయకుండా నిర్బంధించారని, తనను విడిపించడానికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సిందేనని తన భర్త ఫోన్‌లో చెప్పినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన ఎంపీటీసీ వాయిస్ ను పిటిషనర్ తరపు న్యాయవాది డివిజన్ బెంచ్‌కు విన్పించారు. ఈ వాదనలు విన్న హహైకోర్టు కిడ్నాప్‌నకు గురైన ఎంపీటీసీ ఆచూకీ కనుగొని కోర్టు ముందుంచాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+