జగన్ వర్గం కిడ్నాప్ చేసింది: హైకోర్టులో ఎంపిటిసి భార్య పిటిషన్

స్థానిక సం స్థల ప్రతినిథుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దొమ్మ ర నంద్యాల గ్రామంలో రెండో ఎంపీటీసీ సభ్యుడైన తన భర్తను జమ్మలమడుగు ఎ మ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి అనుచరుడు లక్ష్మయ్య కిడ్నాప్ చేశారని పిటిషన్లో ఆమె ఆరోపించారు. తన చుట్టూ మనుషులను పెట్టి ఎటూ కదలనీయకుండా నిర్బంధించారని, తనను విడిపించడానికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సిందేనని తన భర్త ఫోన్లో చెప్పినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు సెల్ఫోన్లో రికార్డు చేసిన ఎంపీటీసీ వాయిస్ ను పిటిషనర్ తరపు న్యాయవాది డివిజన్ బెంచ్కు విన్పించారు. ఈ వాదనలు విన్న హహైకోర్టు కిడ్నాప్నకు గురైన ఎంపీటీసీ ఆచూకీ కనుగొని కోర్టు ముందుంచాలని ఆదేశించింది.
Comments
English summary
MPTC China Venkata Subbanna's wife Obulamma filed petition in High Cort alleging YS Jagan camp MLA Adinarayana Reddy's followers kidnapped her husband. Reacting to the petition High Court ordered District SP to produce China Venkata Subbanna before March 7.
Story first published: Saturday, March 5, 2011, 9:46 [IST]