హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌కు ఊరట, నోటీసు ఇవ్వలేదని చెప్పిన ఎన్నికల కమిషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం విషయంలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు ఊరట లభించింది. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించకూడదని తాము నోటీసు ఇవ్వలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ శనివారం స్పష్టం చేశారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకూడదని మాత్రమే సమాచారం ఇచ్చామని ఆయన చెప్పారు.

పార్టీ జెండా ఆవిష్కరణ కోడ్ ఉల్లంఘన కిందికి రాదని, అయితే ఆ కార్యక్రమం సందర్భంగా కోడ్‌ను ఉల్లంఘించకూడదని ఆయన చెప్పారు. కాగా, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. వైయస్ జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన బంధువు కొండా రెడ్డికి నోటీసు అందజేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి బ్రేకులు పడినట్లు చెప్పారు.

జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైయస్ జగన్‌తో పాటు ఆయన తల్లి వైయస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పులివెందుల చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాలకు విజయమ్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పులివెందులకు వైయస్ జగన్ అభిమానులు కూడా చేరుకున్నారు.

English summary
Ex MP YS Jagan got relief on his party flag launching issue, as Election commission clarifies that it has not served any notice. EC Bhanwarlal said that it is not violation of election code.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X