సీమాంధ్ర నేతలపై బుసకొట్టిన తెలుగుదేశం నేత నాగం జనార్దన్ రెడ్డి
తెలంగాణ ఉద్యమం సునామీలా మారిందని, దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం సీమాంధ్ర శాసనసభ నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్, డిజిపి అరవింద రావు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై హత్యా కేసు నమోదు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు విదేశీయులా, హైదరాబాద్ రావాలంటే వీసాలూ పాస్పోర్టులూ తీసుకోవాలా అని ఆయన అడిగారు. వందలాది చెక్ పోస్టులు ఎందుకు పెట్టారని ఆయన అడిగారు. తెలంగాణ ప్రజలకు భావప్రకటనా స్వేచ్ఛ కూడా లేదని ఆయన అన్నారు.
nagam janardhan reddy telugudesam telangana tank bund hyderabad నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం తెలంగాణ ట్యాంక్ బండ్ హైదరాబాద్
English summary
TDP Telangana region MLA Nagam Janardhan Reddy lashed out at Seemandhra leaders. He criticised that Seemandhra leaders are condemning distruction of statues and ignoring students, who sacrificed their life for Telangana.
Story first published: Saturday, March 12, 2011, 16:35 [IST]