చిరంజీవి బాటలోనే జగన్, సిఎం పదవికే పార్టీ: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి దారిలోనే నడుస్తారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌పై, ఆయన అక్రమ ఆస్తులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏదో చేస్తానని వచ్చిన చిరంజీవి చివరకు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారని, జగన్ కూడా అదే బాటలో నడుస్తారని అన్నారు. జగన్ తన పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుకు బదులు వైఎస్ఆర్ అవినీతి పార్టీ అని పెట్టుకుంటే బావుండేదన్నారు.

దివంగత వైఎస్ చేసిన అవినీతిలో కాంగ్రెస్‌కు కూడా భాగస్వామ్యం ఉందన్నారు. ఆ పాపంలో కాంగ్రెస్ పాలుపంచుకుందన్నారు. జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ పెడుతున్నారన్నారు. పదవుల కోసం పార్టీ పెడితే మనుగడ సాధించలేవన్నారు. జగన్ తన తండ్రినుండి తనకు అక్రమ ఆస్తులు వారసత్వంగా వచ్చినట్టే ముఖ్యమంత్రి పదవి కూడా వస్తుందని భావించారన్నారు. జగన్ తన పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టడం ద్వారా తాను కాంగ్రెస్ వేరు కాదని చెప్పకనే చెప్పారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం విద్యుత్ సరిగా సరఫరా చేయలేక పోతోందన్నారు. తొమ్మది గంటలు ఉచిత విద్యుత్ అని చెప్పిన ప్రభుత్వం కనీసం ఆ మేరకు మాట నిలబెట్టుకోలేక పోతోందన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 1994లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనుండి దిగిపోయిన పరిస్థితే కనిపిస్తోందన్నారు. మా బలం ఆధారంగా మేం రాజకీయాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+