హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేలకు శని పట్టుకుంది: నాగం జనార్ధన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభ్యులకు శని పట్టుకుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి సోమవారం ధ్వజమెత్తారు. మాక్ అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఏం సాధించారని వారు అసెంబ్లీకి వెళుతున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఒత్తిడికి వారు తలొగ్గారని అన్నారు. బడ్జెట్ సమావేశాలకు వారు అవసరం లేదన్నారు. బడ్జెట్ ఆమోదానికి వారు అవసరం లేదన్నారు.

తెలంగాణ ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు నడవకుంటే వారి ఆగ్రహానికి గురి కాక తప్పదన్నారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులను చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు పద్మవ్యూహంలో చిక్కుకున్నారన్నారు.

English summary
TDP senior leadr Nagam Janardhan Reddy blamed Congress MLAs decission. He questioned why they went to assembly. He said Telangana agitation is in public hand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X